News September 19, 2025

TDPలో చేరనున్న ముగ్గురు YCP ఎమ్మెల్సీలు?

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు వీరు ముగ్గురు రాజీనామా చేశారు. కాగా వీరి రాజీనామాలపై మండలి ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

Similar News

News September 19, 2025

ఉల్లి రైతులకు సీఎం శుభవార్త

image

AP: సీఎం చంద్రబాబు ఉల్లి రైతులకు శుభవార్త చెప్పారు. హెక్టారుకు రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైతుల సమస్యపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.100 కోట్ల మేర అదనపు భారం భరించాలని నిర్ణయించారు.

News September 19, 2025

OFFICIAL: ఆస్కార్ బరిలో జాన్వీ మూవీ

image

ఆస్కార్స్-2026కు భారత్ నుంచి హోమ్‌బౌండ్(Homebound) మూవీ అఫీషియల్‌గా నామినేట్ అయింది. బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ ప్రధాన పాత్రల్లో నీరజ్ ఈ మూవీని తెరకెక్కించారు. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు మిత్రులకు ఎదురైన సవాళ్లే ఈ చిత్ర కథ. ఈ ఏడాది కేన్స్‌, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించగా అద్భుత స్పందన వచ్చింది. కాగా ఈ మూవీ ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది.

News September 19, 2025

సమస్యల పరిష్కారంపై CM దృష్టి పెట్టాలి: రాజగోపాల్‌రెడ్డి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ MLA రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ‘స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలి. మెజారిటీ MLAల అభిప్రాయం కూడా ఇదేనని భావిస్తున్నాను. సంక్షేమ పథకాలతో పాటు సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనన్న వాస్తవాన్ని CM గుర్తించి వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు. కాగా దీన్ని BRS నేత హరీశ్‌రావు రీట్వీట్ చేయడం గమనార్హం.