News September 19, 2025
APPLY: బీటెక్ అర్హతతో 119 ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్(కాంట్రాక్ట్) పోస్టులకు ఈ నెల 26 వరకు <
#ShareIt
Similar News
News September 19, 2025
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సరిహద్దుల ఖరారుపై కమిటీ

AP: ఓబుళాపురం మైనింగ్ కేసులో సరిహద్దుల ఖరారుపై జస్టిస్ సుధాంశు ధులియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. సరిహద్దు వివాదం ముగిసిందని, మైనింగ్ కొనసాగించడానికి గాలి బ్రదర్స్కి అనుమతి ఇవ్వాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
News September 19, 2025
స్పీకర్ కార్యాలయమే కోర్టు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కోర్టుగా మారనుంది. పార్టీ ఫిరాయింపులపై BRS ఫిర్యాదుకు కడియం, దానం మినహా మిగతా 8 మంది స్పీకర్కు వివరణ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని BRSకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖ రాశారు. దీంతో వచ్చే వారంలో స్పీకర్ ఛాంబర్లో అటు BRS, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాదనలు విన్పించనున్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయమూర్తి తరహాలో నిర్ణయం తీసుకుంటారు.
News September 19, 2025
రేపు రాయలసీమలో భారీ వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది.