News September 19, 2025

రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్

image

రాజమండ్రి విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎన్.కె.శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 1న తిరుపతికి విమాన సర్వీస్ ప్రారంభం అవుతుందని చెప్పారు. వారానికి మూడు రోజులు ఈ విమాన సర్వీసు నడుస్తుందని వెల్లడించారు.

Similar News

News September 19, 2025

TU: క్రీడాకారులు యూనివర్సిటీకి గుర్తింపును తేవాలి: రిజిస్ట్రార్

image

టీయూ ఇంటర్ కాలేజ్ కబడ్డీ (పురుషుల) ఎంపిక పోటీలను శుక్రవారం ప్రారంభించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రిజిస్ట్రార్ ప్రొ.యం.యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. వర్సిటీలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే.. సౌకర్యాల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డా.ప్రవీణ్, డా.పున్నయ్య పాల్గొన్నారు.

News September 19, 2025

MBNR: మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక సమావేశం

image

మహిళలు, బాలికలు, పిల్లల భద్రతకు సంబంధించి పోలీసులతో సమన్వయం చేసుకోడానికి CID SP అన్యోన్య ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. భరోసా, షీ టీమ్, AHTU, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషించాలని SP సూచించారు. అదనపు SP NB రత్నం, DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

సీతారామ ప్రాజెక్ట్ భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌లో భూ సేకరణ, అటవీ సమస్యలు ఆలస్యానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న భూముల బదలాయింపు, అవార్డులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల సర్వే 20 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు.