News September 19, 2025

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారించాలి: కలెక్టర్

image

ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. పలువురు ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేస్తూ అర్జీలు అందజేశారు. న్యాయమైన, పరిష్కరించుటకు అవకాశం గల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News September 19, 2025

ఏలూరు: ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ఆమె వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీసీ కెమెరాల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోడౌన్‌కు పటిష్టమైన భద్రత కల్పించినట్లు ఆమె తెలిపారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

News September 19, 2025

బీబీనగర్ చెరువులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

బీబీనగర్ చెరువులో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని వరంగల్ జిల్లా అయినవోలుకు చెందిన సురేందర్‌గా పోలీసులు గుర్తించారు. అప్పుల బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ ద్వారా కుటుంబసభ్యులకు ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబీకులు 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సురేందర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

News September 19, 2025

మదనపల్లెలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య

image

మదనపల్లెలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. 2వ పట్టణ CI రాజారెడ్డి వివరాల ప్రకారం.. రామారావుకాలనీలో ఉండే రామన్న(40) తాగి గొడవ చేస్తున్నాడని భార్య రవణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్ రోకలిబండతో కొట్టి హతమార్చారు. రమణమ్మ, ఈశ్వర్‌పై అనుమానంతో విచారించగా విషయం బయటపడింది. బి.కొత్తకోట వద్ద హంద్రీనీవా కాలువలో పాతిపెట్టిన రామన్న మృతదేహాన్ని ఇవాళ వెలికితీసి పోస్టుమార్టం చేశారు.