News September 19, 2025
పులివెందులకు కూడా మేమే నీళ్లిచ్చాం: CBN

ఏపీ, తెలంగాణలో మెజార్టీ ప్రాజెక్టులు తానే ప్రారంభించానని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఇప్పుడు రాయలసీమను రతనాల సీమగా మారుస్తున్నట్లు చెప్పారు. గతంలో పులివెందులకు కూడా తామే నీళ్లిచ్చామన్నారు. కుప్పానికి కృష్ణా జలాలు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందని సీఎం వెల్లడించారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
Similar News
News September 20, 2025
RRB: NTPC CBT1 ఫలితాలు విడుదల

NTPC-2025 పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT1) ఫలితాలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షల కటాఫ్ మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ను <
News September 20, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* నో ఫ్లై జోన్గా TG సెక్రటేరియట్.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.
News September 19, 2025
వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

భారత్తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్టాక్ డీల్కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్లో జిన్పింగ్ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.