News September 19, 2025

అసెంబ్లీ సమావేశాలు వాయిదా

image

AP అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు సందర్భంగా పలు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. నీటి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.

Similar News

News September 20, 2025

RRB: NTPC CBT1 ఫలితాలు విడుదల

image

NTPC-2025 పోస్టులకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT1) ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. జూన్ 5 నుంచి 24 వరకు నిర్వహించిన పరీక్షల కటాఫ్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ను <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచింది. ఎంపికైన వారికి అక్టోబర్ మూడో వారంలో సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT2) నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించనుంది.

News September 20, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* నో ఫ్లై జోన్‌గా TG సెక్రటేరియట్‌‌.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.

News September 19, 2025

వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

image

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.