News September 19, 2025
PDPL: విద్యార్థులకు మెరుగైన బోధనపై దృష్టి : కలెక్టర్

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదర్శ పాఠశాలలు, కేజిబీవీ పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు కచ్చితంగా నమోదుచేయాలని, గైర్హాజరైన వారికి రెగ్యులర్ ఫాలో అఫ్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, అకాడమిక్ ఫలితాల మెరుగుదలకు కృషి చేయాలన్నారు.
Similar News
News September 20, 2025
AP మీదుగా మరో అమృత్ భారత్ రైలు

ఇండియన్ రైల్వేస్ మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనుంది. ఇది ఒడిశాలోని బ్రహ్మపుర్ నుంచి APలోని పలాస, విజయనగరం స్టేషన్ల మీదుగా గుజరాత్లోని సూరత్ సమీపంలోని ఉద్నా స్టేషన్కు చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 11 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లలో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. తాజాగా మరో సర్వీస్ ఏపీ స్టేషన్లను కలుపుతూ అందుబాటులోకి రానుంది.
News September 20, 2025
కామారెడ్డి: ‘దసరా సెలవుల్లో మార్పు చేయాలి’

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను మార్పు చేయాలని రాష్ట్ర జూనియర్ లెక్చలర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం పంపించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు దసరా సెలవులు జూనియర్ కళాశాలలకు ప్రకటించాలని కోరారు. ముందుగా ప్రకటించిన 28వ తేదీని వెంటనే మార్పు చేయాలన్నారు.
News September 20, 2025
ములుగు: బోనస్ కోసం రైతుల ఎదురు చూపు?

ములుగు జిల్లాలో వరి ధాన్యం బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు కావస్తున్నా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. బోనస్కు ఆశపడి సన్నధాన్యం పండించామని అంటున్నారు. దసరాకు అయినా బోనస్ అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో సుమారు 11,379 మంది రైతులకు రూ.30 కోట్లకు పైగా బోనస్ చెల్లించాల్సి ఉంది.