News September 19, 2025

రాజమండ్రి: ‘సాధారణ జ్వరాలు మాత్రమే..  ఆందోళన వద్దు’

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కనిపిస్తున్న జ్వరాలు సాధారణ జ్వరాలేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News September 20, 2025

రాజమండ్రి: ‘సాధారణ జ్వరాలు మాత్రమే..  ఆందోళన వద్దు’

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కనిపిస్తున్న జ్వరాలు సాధారణ జ్వరాలేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

News September 19, 2025

NMMS స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు: డీఈవో

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) కోసం విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. 2024 డిసెంబర్ 8న జరిగిన పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు, 2021, 2022, 2023లో ఎంపికైన విద్యార్థులు కూడా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో తప్పకుండా తమ దరఖాస్తులను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.

News September 19, 2025

ఈనెల 20న కలెక్టరేట్‌లో జాబ్ మేళా: కలెక్టర్ కీర్తి

image

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈ నెల 20న వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రముఖ కంపెనీలు టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.