News September 19, 2025
మూడు వికెట్లు కోల్పోయిన భారత్

ఆసియా కప్: ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత 5 పరుగులు చేసి శుభమన్ గిల్ పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత 8వ ఓవర్లో అభిషేక్ శర్మ(38), హార్దిక్(1) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అక్షర్(7), శాంసన్(28) ఉన్నారు. భారత్ స్కోర్ 84/3గా ఉంది.
Similar News
News September 20, 2025
ఒమన్ అద్భుత ప్రదర్శన.. పాక్కు చురకలు!

ఆసియా కప్: టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో పసికూన ఒమన్ జట్టు అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో శభాష్ అనిపించుకుంది. చివరి వరకు పోరాడి 21 రన్స్ తేడాతో <<17767421>>ఓడిపోయింది<<>>. ఈ నేపథ్యంలో ఒమన్ జట్టును చూసి పాక్ చాలా నేర్చుకోవాలని నెటిజన్స్ చురకలు అంటిస్తున్నారు. చిన్న జట్టు అయినా తమ పోరాటంతో హృదయాలు గెలిచిందని కామెంట్స్ చేస్తున్నారు.
News September 20, 2025
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: TTD

AP: 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు TTD EO అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇబ్బందిలేకుండా సూక్ష్మ-క్షేత్రస్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఉ.8-10 గం. వరకు, రా.7-రా.9 గం. వరకు వాహన సేవలు. సా.6.30- రాత్రి 12 గంటల వరకు గరుడసేవ ఉంటుందన్నారు. ధ్వజారోహణం(SEP 24) రోజు CM చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
News September 20, 2025
AP మీదుగా మరో అమృత్ భారత్ రైలు

ఇండియన్ రైల్వేస్ మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనుంది. ఇది ఒడిశాలోని బ్రహ్మపుర్ నుంచి APలోని పలాస, విజయనగరం స్టేషన్ల మీదుగా గుజరాత్లోని సూరత్ సమీపంలోని ఉద్నా స్టేషన్కు చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 11 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లలో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. తాజాగా మరో సర్వీస్ ఏపీ స్టేషన్లను కలుపుతూ అందుబాటులోకి రానుంది.