News September 20, 2025

AP మీదుగా మరో అమృత్ భారత్ రైలు

image

ఇండియన్ రైల్వేస్ మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనుంది. ఇది ఒడిశాలోని బ్రహ్మపుర్ నుంచి APలోని పలాస, విజయనగరం స్టేషన్ల మీదుగా గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఉద్నా స్టేషన్‌కు చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 11 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. తాజాగా మరో సర్వీస్ ఏపీ స్టేషన్లను కలుపుతూ అందుబాటులోకి రానుంది.

Similar News

News September 20, 2025

H1B వీసా అంటే ఏంటి?

image

అమెరికా ప్రభుత్వం టెక్ కంపెనీల కోసం <<17767574>>H1B వీసాలను<<>> జారీ చేస్తుంది. విదేశాలకు చెందిన ఐటీ, ఇంజినీరింగ్, ఫైనాన్స్, ఆరోగ్య నిపుణులను అమెరికా తీసుకెళ్లేందుకు పలు కంపెనీలు H1Bని ఉపయోగిస్తాయి. ఈ వీసాలు మూడేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 85వేల H1B వీసాలు జారీ చేస్తాయి. వీటి ద్వారా ఎక్కువగా భారతీయులే లబ్ధి పొందుతున్నారు.

News September 20, 2025

ఐటీ కంపెనీలపై ఎఫెక్ట్ ఇలా..!

image

భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL లాంటి సంస్థలు USలో పని చేస్తూ భారతీయులను రిక్రూట్ చేసుకుంటాయి. H1B వీసా అప్లికేషన్ ఫీజు పెంపుతో వాటిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఫలితంగా ఆ సంస్థలు ఇండియా లేదా ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో భారతీయులు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు.

News September 20, 2025

ఆసియా కప్: సూపర్-4లో భారత్ షెడ్యూల్ ఇదే

image

ఆసియా కప్‌లో ఇవాళ్టి నుంచి సూపర్-4 సమరం మొదలవనుంది. ఈరోజు తొలి మ్యాచులో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. రేపు ఇండియా, పాక్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. 23న SLvsPAK, 24న INDvsBAN, 25న BANvsPAK, 26న INDvsSL మ్యాచులు జరగనున్నాయి. అన్ని మ్యాచులు రా.8 గంటలకు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు. సూపర్-4లో టాప్-2లో నిలిచిన జట్లు ఈ నెల 28న ఫైనల్ ఆడతాయి.