News September 20, 2025
నిర్మల్: 22 నుంచి టాస్ పరీక్షలు

ఈనెల 22 నుంచి 28 వరకు టాస్ పదో, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్మల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తెలిపారు. పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మెరత్ పేట్లో పరీక్ష కేంద్రం కలదని, ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాల ఈదిగాంలో పరీక్షా కేంద్రం ఉంటుందని వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటాయన్నారు.
Similar News
News September 20, 2025
నాయుడుపేట: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నాయుడుపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కల్లిపేడు పంచాయతీకి చెందిన శివయ్య(34) ఇంటి ఆవరణలో ఉన్న గడ్డివాములో పనిచేస్తూ ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శివయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 20, 2025
మర్లపాడుకి ఈ నెల 21న మంత్రుల రాక

స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న మర్లపాడులోఎన్.టి.ఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ జరుగనుందని దామచర్ల సత్య శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, డోలాబాల వీరాంజనేయ స్వామి, MPలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొంటారని చెప్పారు.
News September 20, 2025
స్వచ్ఛ దివస్ లో పాల్గొన్న పోలీసులు

ముఖ్యమంత్రి పిలుపు మేరకు శనివారం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్”లో భాగంగా జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు పోలీస్ కార్యాలయం, పెరేడ్ గ్రౌండ్, నివాస ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్తను తొలగించి, మొక్కలు నాటారు. శుభ్రత ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.