News September 20, 2025
వరంగల్ మార్కెట్ రెండు రోజులు బంద్

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News September 20, 2025
రూ.35వేల కోట్లంటూ హరీశ్ తప్పుడు ప్రచారం: ఉత్తమ్

TG: తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి <<17757923>>రూ.35వేల కోట్లు<<>> అంటూ హరీశ్ రావు చేసిన ప్రకటన అబద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకే నీళ్లొస్తాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, అయితే ప్రభుత్వం అంచనాలు రూపొందించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని చెప్పారు.
News September 20, 2025
నాయుడుపేట: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నాయుడుపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కల్లిపేడు పంచాయతీకి చెందిన శివయ్య(34) ఇంటి ఆవరణలో ఉన్న గడ్డివాములో పనిచేస్తూ ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శివయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 20, 2025
మర్లపాడుకి ఈ నెల 21న మంత్రుల రాక

స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న మర్లపాడులోఎన్.టి.ఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ జరుగనుందని దామచర్ల సత్య శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, డోలాబాల వీరాంజనేయ స్వామి, MPలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొంటారని చెప్పారు.