News September 20, 2025
జగిత్యాల: ‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి’

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై జగిత్యాల కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 10,775 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు. 7,261 మార్కౌట్, 2,569 బేస్మెంట్ స్థాయిలో, 428 గోడల నిర్మాణం వరకు 165 స్లాబ్ దశకు రాగ ఒక ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News September 20, 2025
డేంజర్ చికెన్.. నిర్వాహకుడిపై కేసు నమోదు

అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
News September 20, 2025
న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. రూ.3.8 కోట్లు వసూలు

నాగర్కర్నూల్ (TG) జిల్లాకు చెందిన మల్లేశ్, భార్య మేరీ, స్నేహితురాలు లిల్లీ Xలో ‘సంయుక్త రెడ్డి’ పేరిట అకౌంట్ క్రియేట్ చేశారు. కర్నూలుకు చెందిన ఓ వ్యాపారిని పరిచయం చేసుకుని న్యూడ్ వీడియోలు పంపారు. ఓ మహిళతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయించారు. ఆ తర్వాత తక్కువ ధరకే పొలాలు, ప్లాట్లు అమ్ముతామని నమ్మించారు. దాంతో పాటు బెదిరించి రెండేళ్లలో రూ.3.8 కోట్లు వసూలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
News September 20, 2025
నేడు విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు స్పాట్ అడ్మిషన్లు

వరంగల్ జిల్లా హంటర్ రోడ్డులోని తెలుగు యూనివర్సిటీ జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఎంఏ తెలుగు అడ్మిషన్ల కోసం శనివారం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు. ఉదయం 10 గంటల నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.