News September 20, 2025
రాయచోటిలో వర్ష బీభత్సం.. ముగ్గురి మృతి

రాయచోటిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న తల్లీ, బిడ్డ షేక్ మున్నీ(27), ఇలియాస్ (6)ను కాపాడబోయి మరో వ్యక్తి వంగల గణేశ్ (30) మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటోలో నుంచి దూకేసి మాధవరం ఆరవ వాండ్లపల్లికి చెందిన ఆరవ యామిని (8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News September 20, 2025
ఎర్లీ మెనోపాజ్లో ఏం తినాలంటే..

ప్రతి మహిళకు మెనోపాజ్ సాధారణం. అయితే కొందరికి హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో జీవక్రియ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే రాగి, జొన్నజావలు తీసుకోవాలి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి.
News September 20, 2025
పసుపు పంటలో నత్రజని లోపం-లక్షణాలు

పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం, భూమిలో క్షార, చౌడు గుణం కలిగి ఉండటం.. సమతుల, సమగ్ర ఎరువులు వాడకపోవడం పసుపు పంటలో నత్రజని లోపానికి ప్రధాన కారణం. దీని వల్ల ఆకులు పాలిపోయి ఆకుపచ్చ లేదా పసుపుపచ్చగా మారతాయి. పైరు కురచగా అవ్వడం, ఆకులు కొన నుంచి మధ్య వరకు మాడిపోవడం జరుగుతుంది. ఈ లోపం వల్ల కొమ్మల్లో పచ్చదనం తగ్గి ముదురు ఆకులు త్వరగా ఎండిపోతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
News September 20, 2025
పసుపులో నత్రజని లోపం నివారణకు సూచనలు

పసుపు పంటలో నత్రజని లోపాన్ని నివారించడానికి.. సాగు సమయంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగు నీటిని బయటకు పంపేందుకు తగిన ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ నిపుణుల సూచనలతో సమతుల సమగ్ర ఎరువులు వాడాలి. లీటరు నీటికి 20 గ్రాముల యూరియా, 1/2 మి.లీ జిగురు మందును కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పసుపు విత్తిన వెంటనే మల్చింగ్ చేయడం మంచిదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.