News September 20, 2025
HNK: చావు పిలుస్తోందంటూ సూసైడ్

భర్త చెరువులో దూకి సూసైడ్ చేసుకోగా.. తను లేకుండా ఉండలేనంటూ అదే చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఐనవోలు మండలం రాంపూర్కు చెందిన సురేంద్ర HYD రామాంతపూర్లో ఉంటున్నారు. తనను చావు పిలుస్తుందంటూ శుక్రవారం బీబీనగర్(భువనగిరి) చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా సురేంద్ర భార్య సంధ్యారాణి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు.
Similar News
News September 20, 2025
మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

మనిషికి ఆల్కహాల్తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.
News September 20, 2025
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: పెమ్మసాని

ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో జరిగిన ‘నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్-2025’లో ఆయన పాల్గొన్నారు. రోగనిర్ధారణ ఆలస్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారని పెమ్మసాని తెలిపారు. వైద్య సేవల్లోని లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
News September 20, 2025
ఎర్లీ మెనోపాజ్లో ఏం తినాలంటే..

ప్రతి మహిళకు మెనోపాజ్ సాధారణం. అయితే కొందరికి హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్ వస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టిరాన్ పెరుగుతుంది. దీంతో జీవక్రియ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే రాగి, జొన్నజావలు తీసుకోవాలి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉండే కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. ప్రాసెసింగ్ ఫుడ్స్, చాక్లెట్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి.