News September 20, 2025
రూ.35వేల కోట్లంటూ హరీశ్ తప్పుడు ప్రచారం: ఉత్తమ్

TG: తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి <<17757923>>రూ.35వేల కోట్లు<<>> అంటూ హరీశ్ రావు చేసిన ప్రకటన అబద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకే నీళ్లొస్తాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని, అయితే ప్రభుత్వం అంచనాలు రూపొందించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని చెప్పారు.
Similar News
News September 20, 2025
సమయం వచ్చింది.. దేశాభివృద్ధికి ప్రతిభను వాడుదాం!

ట్రంప్ నిర్ణయాల వేళ మన ప్రతిభతో ఇండియాను అభివృద్ధి చేసుకోవాలనే చర్చ మొదలైంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతక్కుండా మన దగ్గరే ప్రతిభను ఉపయోగించుకొని దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్లు, టెక్నాలజీ, వ్యవసాయం వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రతి సవాలును అవకాశంగా మలుచుకొని దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టే సత్తా మన యువతకు ఉందంటున్నారు.
News September 20, 2025
ట్రంప్ నిర్ణయంతో భారతీయుల ఉద్యోగాలు పోతాయ్: కాంగ్రెస్

US H-1B వీసా ఫీజులు పెంచడంతో భారత్ చాలా నష్టపోతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘మోదీ ఫ్రెండ్ ట్రంప్ ₹6లక్షలుగా ఉన్న H-1B వీసా ఫీజును ₹88లక్షలకు పెంచారు. దీని వల్ల ఇండియన్స్కు USలో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అక్కడి నుంచి INDకు వచ్చే మనీ తగ్గుతుంది. ఇక్కడి IT ఉద్యోగుల జాబ్స్ రిస్క్లో పడతాయి. మోదీ ఫెయిల్డ్ ఫారిన్ పాలసీ పరిణామాలను దేశం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది’ అని పేర్కొంది.
News September 20, 2025
మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

మనిషికి ఆల్కహాల్తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.