News September 20, 2025
మదనపల్లి: టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి

టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లిలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సైదాపేటకు చెందిన సాదియా రీలింగ్ పనిచేసేందుకు వెలుతు తన కుమార్తె అలిజ(2)ను తీసుకెళ్లింది. చంద్రకాలనీ రీలింగ్ కేంద్రంలో వదలడంతో చిన్నారి నీళ్లు అనుకోని టార్పెంట్ ఆయిల్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది.
Similar News
News September 20, 2025
NZB కమీషనరేట్ పరిధిలో పలువురు SIల బదిలీ

NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు SIలను బదిలీ చేస్తూ CP సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్మూర్లో ఉన్న గోవింద్, 4వ టౌన్లోని మహేష్, VRలో ఉన్న మహేష్ను CCS NZBకు బదిలీ చేశారు. అలాగే VR లోఉన్న వినయ్ కుమార్ను ఆర్మూర్కు, సాయాగౌడ్ను CSB NZB, BBS రాజును కలెక్టరేట్, సామ శ్రీనివాస్ను సౌత్ రూరల్ నుంచి NZB రూరల్ ఎస్సై-2గా, మొగులయ్యను ఒకటో టౌన్ నుంచి మాక్లూర్ఎస్సై-2గా బదిలీ చేశారు.
News September 20, 2025
Pharm.D, B.Pharmacy, M.Sc పరీక్షా ఫలితాలు విడుదల

అనంతపురం JNTUలో ఆగస్టులో జరిగిన Pharm.D 2, 5వ సంవత్సరాల సెమిస్టర్ల, B.Pharmacy 2-1, 2-2 సెమిస్టర్ల, M.Sc 1, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
News September 20, 2025
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, జనగాం, నల్గొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని అంచనా వేశారు. అటు హైదరాబాద్లో రాత్రి సమయంలో వర్షం పడుతుందని పేర్కొన్నారు.