News September 20, 2025
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఉచితంగా లడ్డూ ప్రసాదం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. మూలా నక్షత్రం, దశమి రోజుల్లో టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయం 22 గంటలకు పెంచింది. ఉచితంగా లడ్డూ ప్రసాదం, పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News September 20, 2025
చెత్తతో పాటు చెత్త రాజకీయాలనూ తొలగిస్తా: CBN

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత పాలకులు విధించిన చెత్త పన్ను తొలగించామని, 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యత తీసుకున్నామని CM చంద్రబాబు అన్నారు. మాచర్లలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర సభలో ఆయన మాట్లాడారు. ‘గతంలో ఇక్కడ చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నా. మన పరిసరాల్లోని చెత్తతో పాటు చెత్త రాజకీయాలనూ తొలగిస్తా’ అని చంద్రబాబు తెలిపారు.
News September 20, 2025
రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. జగన్ కామెంట్స్ వైరల్

AP: ఇటీవల జరిగిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి రావట్లేదని స్పీకర్ అనర్హత వేటు వేస్తే.. ఎమ్మెల్యేలు, ఎంపీలందరం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దామని జగన్ చెప్పినట్లు సమాచారం. తాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామని చెప్పలేదని, మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని జగన్ తెలిపారు.
News September 20, 2025
దీపిక పోస్ట్.. ‘కల్కి’ని ఉద్దేశించేనా?

‘కల్కి’ నుంచి తప్పుకున్నాక నటి దీపికా పదుకొణే ఇన్స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 18 ఏళ్ల క్రితం ‘ఓంశాంతి ఓం’ సినిమా చేసినప్పుడు షారుఖ్ తనకు ఓ పాఠం చెప్పారని గుర్తుచేసుకున్నారు. ‘ఒక సినిమా విజయంతో పోలిస్తే అది అందించే అనుభవం, దాని కారకులే మరింత ముఖ్యమన్న ఆయన సలహాను నా ప్రతి నిర్ణయానికీ అమలు చేస్తున్నా. అందుకే మేమిద్దరం ఆరోసారి కలిసి నటిస్తున్నామేమో’ అని రాసుకొచ్చారు.