News September 20, 2025

చీకట్లో కరీంనగర్ స్మార్ట్ సిటీ

image

కరీంనగర్ కార్పొరేషన్‌లో స్ట్రీట్ లైట్స్ నిర్వహణ చూసే EESL ఏజెన్సీ కాంట్రాక్ట్ ముగియడంతో స్ట్రీట్ లైట్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నగరవ్యాప్తంగా 11 వేల వీధిలైట్లు ఉండగా 150 CCMS బాక్సులు, టైమర్స్, సెన్సార్లు, బ్రేకర్లు రిలేలు పనిచేయడం లేదు. రోజుకు 140 వరకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Similar News

News September 20, 2025

GST ఎఫెక్ట్.. సిలిండర్ ధర తగ్గుతుందా?

image

ఈనెల 22 నుంచి GST కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో నిత్యావసరాలతో పాటు చాలా వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. అయితే నిత్యం వాడే వంటగ్యాస్ సిలిండర్ రేటు కూడా తగ్గుతుందా అనే సందేహం సామాన్యుల్లో నెలకొంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్‌పై 5%, కమర్షియల్ సిలిండర్‌పై 18% GST అమల్లో ఉంది. ఇకపైనా ఇదే కొనసాగనుంది. దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు. డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.905 ఉంది.

News September 20, 2025

సిరిసిల్ల కలెక్టర్ బదిలీకి రంగం సిద్ధం?

image

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణలో ప్రొటోకాల్ విస్మరించడం పట్ల చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న విప్ ఆది శ్రీనివాస్ ప్రొటోకాల్‌తో పాటు కలెక్టర్ తరచూ వివాదాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై రేవంత్ సీరియస్‌గా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.

News September 20, 2025

BREAKING: HYD: విషాదం.. ఇద్దరు యువకులు మృతి

image

HYD బొల్లారంలో ఈరోజు విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు యువకులను రైలు ఢీకొట్టింది. పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు కార్ఖానా, మచ్చ బొల్లారం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.