News September 20, 2025
సిరిసిల్ల: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య

వేములవాడలో దారుణం జరిగింది. మాజీ కౌన్సిలర్ దారుణహత్యకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. వేములవాడ నందికమాన్ వద్ద కారులో ఉన్న సిరిగిరి రమేశ్ ను గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 20, 2025
వీసా ఫీజు పెంపు.. మోదీపై రాహుల్, ఖర్గే ఫైర్

US H-1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో PM మోదీపై LoP రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘నేను మళ్లీ చెబుతున్నా. ఇండియాకు బలహీనుడు ప్రధానిగా ఉన్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అన్న మోదీకి ట్రంప్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్తో భారతీయులు నష్టపోతున్నారు. హగ్స్, స్లోగన్స్, కాన్సర్టులు కాదు.. దేశ అవసరాలను కాపాడటమే ఫారిన్ పాలసీ’ అని ఖర్గే విమర్శించారు.
News September 20, 2025
HYD: కేబీఆర్ పార్కులో రేపు కుక్క పిల్లలను ఇస్తారు..!

రేపు KBR పార్కులో దేశీ పప్పీ డాగ్ అడాప్షన్ మేళా జరగనున్న నేపథ్యంలో GHMC అధికారులు కుక్క పిల్లల ప్రేమికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పార్కు వద్దకు వచ్చి దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు. అభిమానులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
News September 20, 2025
RITESలో 27 పోస్టులు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్స్ సర్వీస్(<