News September 20, 2025
రాయచోటి: మృతుల కుటుంబీకులకు రూ. 6 లక్షలు

రాయచోటి వరద బీభత్సం<<17768172>> నలుగురిని పొట్టనపెట్టుకున్న విషయం<<>> తెలిసిందే. ఈ మేరకు మృతుల కుటుంబాలను మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పరామర్శించి ప్రభుత్వం తరఫున ఒక్కోరికి రూ. 5 లక్షలు, తాను వ్యక్తిగతంగా రూ. లక్ష ఇచ్చారు. నిన్న సాయంత్రం వర్షం వస్తుండగా.. ఒక అరుగుపైన నిల్చొని ఉన్న తల్లీకొడుకు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లి మరో వ్యక్తి చనిపోయాడు. కాసేపటికి మరో చిన్నారి కొట్టుకుపోయింది.
Similar News
News September 20, 2025
HYD: దసరా తర్వాత పాఠశాలల్లో తనిఖీలు..!

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అధికారి రెండు జిల్లాలను తనిఖీ చేయనున్నారు. స్కూళ్లలో పరిశుభ్రత, కొత్త ప్రవేశాలు, డేటా సవరణ, ముఖ గుర్తింపు హాజరు అమలు, PM పోషణ స్కీమ్ అమలు వంటి విషయాలను దసరా తర్వాత ఈ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చని యోచిస్తోంది.
News September 20, 2025
HYD: దసరా తర్వాత పాఠశాలల్లో తనిఖీలు..!

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అధికారి రెండు జిల్లాలను తనిఖీ చేయనున్నారు. స్కూళ్లలో పరిశుభ్రత, కొత్త ప్రవేశాలు, డేటా సవరణ, ముఖ గుర్తింపు హాజరు అమలు, PM పోషణ స్కీమ్ అమలు వంటి విషయాలను దసరా తర్వాత ఈ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చని యోచిస్తోంది.
News September 20, 2025
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ కావ్య

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరంలా మారిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు ఈరోజు ఎంపీ CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.6,87,500 విలువల చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.