News September 20, 2025

MDK: పింఛన్‌ ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..?

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటితో 20 నెలలు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు ప్రచార సభల్లో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. ఒంటరి మహిళలు, నేత కార్మికులు, వృద్ధులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6 వేల వరకు పింఛన్లు పెంచుతామని తెలిపింది. అయితే ఇంతవరకు పెన్షన్ల పెంపు ముచ్చట లేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 4,69,575 పింఛన్‌దారులు పెంపు కోసం ఎదురుచూస్తున్నారు.

Similar News

News September 20, 2025

HYD: దసరా తర్వాత పాఠశాలల్లో తనిఖీలు..!

image

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అధికారి రెండు జిల్లాలను తనిఖీ చేయనున్నారు. స్కూళ్లలో పరిశుభ్రత, కొత్త ప్రవేశాలు, డేటా సవరణ, ముఖ గుర్తింపు హాజరు అమలు, PM పోషణ స్కీమ్ అమలు వంటి విషయాలను దసరా తర్వాత ఈ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చని యోచిస్తోంది.

News September 20, 2025

HYD: దసరా తర్వాత పాఠశాలల్లో తనిఖీలు..!

image

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అధికారి రెండు జిల్లాలను తనిఖీ చేయనున్నారు. స్కూళ్లలో పరిశుభ్రత, కొత్త ప్రవేశాలు, డేటా సవరణ, ముఖ గుర్తింపు హాజరు అమలు, PM పోషణ స్కీమ్ అమలు వంటి విషయాలను దసరా తర్వాత ఈ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చని యోచిస్తోంది.

News September 20, 2025

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ కావ్య

image

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరంలా మారిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు ఈరోజు ఎంపీ CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.6,87,500 విలువల చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.