News September 20, 2025
TSR కంపెనీకి రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ!

మాజీ MP టి.సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని గాయత్రి ప్రాజెక్ట్స్ చెల్లించాల్సిన రూ.5,700 కోట్ల అప్పులు మాఫీ అయ్యాయి. ఆ కంపెనీ రూ.8,100 కోట్లను కెనరా నేతృత్వంలోని బ్యాంకులకు చెల్లించడంలో విఫలమైంది. 2022లో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో దివాలా పిటిషన్ దాఖలైంది. ఏ కంపెనీ దాన్ని కొనుగోలు చేయకపోవడంతో TSR కుటుంబమే వన్టైమ్ సెటిల్మెంట్ కింద రూ.2,400 కోట్లు చెల్లిస్తామని చెప్పగా NCLT ఆమోదం తెలిపింది.
Similar News
News September 20, 2025
రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య విమాన సర్వీసులు

AP: రాజమహేంద్రవరం-తిరుపతి మధ్య OCT 1 నుంచి విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. తొలి సర్వీసు ఆ రోజు ఉ.9:25గంటలకు తిరుపతి నుంచి రాజమహేంద్రవరం వచ్చి, ఉ.10:15గంటలకు తిరిగి వెళ్తుంది. OCT 2 నుంచి వారానికి 3 రోజులు(మంగళ, గురు, శని) ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. ప్రతి రోజూ తిరుపతిలో ఉ.7:40గంటలకు బయల్దేరి రాజమహేంద్రవరానికి వస్తుంది. తిరిగి ఉ.9:50 గంటలకు బయల్దేరుతుంది.
News September 20, 2025
ఉగ్ర కలకలం.. రాంచీలో ISIS రిక్రూట్మెంట్ శిబిరం

ఝార్ఖండ్లోని రాంచీలో ISIS ఉగ్రవాద రిక్రూట్మెంట్ శిబిరం బట్టబయలైంది. కొన్నిరోజుల కిందట ఈ నగరంలో అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియడంతో రైడ్ చేశారు. అక్కడ పెద్దఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
News September 20, 2025
ఐఫోన్-17 నాణ్యతపై విమర్శలు!

యాపిల్ నుంచి ఐఫోన్-17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే, గత సిరీస్లతో పోల్చితే 17 మోడల్స్లో నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలొస్తున్నాయి. దీనివల్ల ఫోన్పై గీతలు పడటం, దెబ్బ తినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ -17 ఫ్రేమ్కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది.