News September 20, 2025

భూపాలపల్లి: తేనెటీగల పెంపక రైతులకు సబ్సిడీ

image

తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు ఉద్యానవన శాఖ సబ్సిడీ ద్వారా ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం కింద తేనెటీగల పెంపకం చేపట్టే వారికి 40% నుంచి 60% వరకు సబ్సిడీ అందుతుందని పేర్కొన్నారు. ఈ పథకంలో చేరడానికి ఆసక్తి ఉన్న రైతులు మరిన్ని వివరాల కోసం జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదించాలని కోరారు.

Similar News

News September 20, 2025

భారత్‌తో వన్డే.. ఆసీస్ అమ్మాయిల విధ్వంసం

image

భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ చెలరేగింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయింది. బెత్ మూనీ 75 బంతుల్లోనే 138 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. ఆమె ఏకంగా 23 ఫోర్లు బాదారు. జార్జియా 81, పెర్రీ 68, గార్డ్‌నర్ 39, హీలీ 30 రన్స్‌తో రాణించారు. ఉమెన్స్ వన్డేల్లో 400 స్కోర్ దాటడం ఇది ఏడోసారి కాగా ఆసీస్ రెండో సారి ఈ ఫీట్ సాధించింది. ఈ భారీ స్కోర్‌ను భారత్ ఛేదిస్తుందా? COMMENT

News September 20, 2025

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదు: బీజేపీ స్టేట్ చీఫ్

image

తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ సమస్యపై HYDలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈరోజు మాట్లాడారు. 2020లో BRS ప్రభుత్వం తెచ్చిన G.O.68 చిన్న హోర్డింగ్ ఏజెన్సీలను కూలదోసిందని ఆరోపించారు. 3 పెద్ద ఏజెన్సీలకు మాత్రమే లాభం చేకూర్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కుటుంబాల జీవనోపాధి దెబ్బతిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల తర్వాత కూడా హామీ నిలబెట్టలేదని విమర్శించారు.

News September 20, 2025

పాలకొల్లులో: మొక్కలు నాటిన కలెక్టర్ నాగరాణి

image

స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాలకొల్లులోని ఆదిత్య కాలనీలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.