News September 20, 2025

నవంబర్ 14న నాగార్జున ‘శివ’ రీరిలీజ్

image

అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘శివ’ సినిమా రీరిలీజ్ తేదీ ఖరారైంది. ఇండియన్ సినిమాను షేక్ చేసిన ‘శివ’ నవంబర్ 14న రీరిలీజ్ అవుతుందని నాగ్ ట్వీట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. 4K క్వాలిటీ & డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. అమల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.

Similar News

News September 20, 2025

మైథాలజీ క్విజ్ – 11 సమాధానాలు

image

1. రామాయణంలో తాటకి భర్త ‘సుందుడు’. వీళ్లిద్దరి పుత్రుడే ‘మారీచుడు’.
2. మహాభారతంలో శంతనుడి మొదటి భార్య ‘గంగ’. వీళ్లిద్దరూ భీష్ముడి తల్లిదండ్రులు.
3. సరస్వతీ దేవి వాహనం ‘హంస’.
4. పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశంలో ఉంది.
5. దీపావళి సందర్భంగా ‘లక్ష్మీ దేవి’ని పూజిస్తారు.
<<-se>>#mythologyquiz<<>>

News September 20, 2025

ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు

image

AP: పలువురు IAS అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ‌జెన్‌కో ఎండీగా ఎస్.నాగలక్ష్మి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బీఆర్ అంబేడ్కర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్‌గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధిశాఖ అదనపు కమిషనరుగా అమిలినేని భార్గవ్ తేజ.. కృష్ణా జిల్లా జేసీగా మల్లారపు నవీన్‌ను నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News September 20, 2025

అదృష్టం అంటే ఈమెదే!

image

MP మహిళ గోల్డర్‌ను అదృష్టం వరించింది. పన్నా జిల్లాలో మైనింగ్ చేసే ఆమెకు 8 వజ్రాలు దొరికాయి. వీటిని జిల్లా డైమండ్ ఆఫీస్‌లో జమ చేయగా త్వరలో వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వజ్రాల్లో అతిపెద్దది 0.79 క్యారెట్ల బరువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వజ్రం విలువ రూ.4-6 లక్షలు పలకొచ్చన్నారు. వజ్రాల గనులకు పన్నా జిల్లా ఫేమస్. ఇక్కడ 8మీ. మైనింగ్ ప్లాట్‌ను ఏడాదికి రూ.200 చొప్పున లీజుకు ఇస్తారు.