News September 20, 2025

పసుపు పంటలో నత్రజని లోపం-లక్షణాలు

image

పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండటం, భూమిలో క్షార, చౌడు గుణం కలిగి ఉండటం.. సమతుల, సమగ్ర ఎరువులు వాడకపోవడం పసుపు పంటలో నత్రజని లోపానికి ప్రధాన కారణం. దీని వల్ల ఆకులు పాలిపోయి ఆకుపచ్చ లేదా పసుపుపచ్చగా మారతాయి. పైరు కురచగా అవ్వడం, ఆకులు కొన నుంచి మధ్య వరకు మాడిపోవడం జరుగుతుంది. ఈ లోపం వల్ల కొమ్మల్లో పచ్చదనం తగ్గి ముదురు ఆకులు త్వరగా ఎండిపోతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Similar News

News September 20, 2025

ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు: సీఎం

image

AP: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమది అని సీఎం CBN తెలిపారు. ‘ఉల్లి రైతులకు నష్టం జరగకుండా హెక్టారుకు రూ.50వేలు చెల్లించాలని నిర్ణయించాం. దీంతో 45వేల ఎకరాల ఉల్లి రైతులకు లబ్ధి చేకూరుతుంది. పంట పూర్తిగా సిద్ధం అయిన తర్వాత ఆరబెట్టి, గ్రేడింగ్ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. వారి పంటతో సంబంధం లేకుండానే ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50వేలు చెల్లిస్తాం’ అని CM ప్రకటించారు.

News September 20, 2025

BREAKING: మోహన్‌లాల్‌కు దాదా‌సాహెబ్ ఫాల్కే అవార్డ్

image

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను దాదా‌సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. 2023 సంవత్సరానికి గానూ కేంద్రం ఆయన్ను ఎంపిక చేసింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. మోహన్‌లాల్‌ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో నటించి మెప్పించారు.

News September 20, 2025

పిల్లల్లో అసూయ పెరుగుతోందా?

image

సాధారణంగా పిల్లలు కొన్నిసార్లు ఇతరులను చూసి అసూయ పడతారు. దాన్ని తల్లిదండ్రులు గుర్తించి మొదట్లోనే కట్టడి చేయాలి. లేదంటే భవిష్యత్తులో ప్రవర్తన విపరీతంగా మారొచ్చు. ముందు దానికిగల కారణాన్ని తెలుసుకోవాలి. సానుకూలంగా ఆలోచించడం, వారి ప్రత్యేకతలపై దృష్టి పెట్టడం నేర్పాలి. స్నేహం గొప్పతనం గురించి వారికి వివరించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం. అప్పుడే పిల్లలు రాగద్వేషాలకు అతీతంగా ఎదుగుతారు.