News September 20, 2025

కొడంగల్‌లో 15వేల ఓట్ల చోరీ: CM రేవంత్

image

కొడంగల్ నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 15వేల ఓట్లు చోరీ చేసినట్లు CM రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పోలింగ్ బూతులో 5 నుంచి 10 శాతం ఓట్లు తొలగించారని తెలిపారు. ఓట్ల చోరీపై నిరసన కూడా వ్యక్తం చేసినట్లు గుర్తుచేశారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 9,319 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Similar News

News September 20, 2025

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. APPLY

image

AP: SC, ST, BC, OC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అంబేడ్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. IBPS, RRB, SSC వంటి పోటీ పరీక్షల కోసం తిరుపతి, విశాఖ కేంద్రాల్లో శిక్షణ ఇస్తామని, ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 24 నుంచి OCT 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9949686306 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News September 20, 2025

గవర్నర్, రేవంత్, కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

image

TG: రేపటి నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం KCR తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండగ బతుకమ్మ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కష్టాల నుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రకృతి మాత బతుకమ్మను ప్రార్థిస్తున్నట్లు KCR తెలిపారు.

News September 20, 2025

ట్రంప్ నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: శ్రీధర్ బాబు

image

TG: H1B వీసా ఛార్జీలను పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘మన రాష్ట్రం నుంచి అమెరికాకు చాలామంది వెళ్లారు. ఇక్కడ కుటుంబాలు వాళ్లు పంపించే మనీ పైనే ఆధారపడుతున్నాయి. TCSలో లక్ష మంది, విప్రోలో 80 వేలు, ఇన్ఫోసిస్‌లో 60 వేల మంది USలో పనిచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై PM మోదీ మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేంటి. USతో కేంద్రం చర్చలు జరపాలి’ అని కోరారు.