News September 20, 2025

శ్రీకాకుళాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

సుందర శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యమవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు . మండలంలోని గనగలవానిపేట సాగర తీరంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొన్నారు.

Similar News

News September 20, 2025

పలాస: ఈ చిన్నారి వివరాలు తెలిస్తే సమాచారమివ్వండి

image

పలాస రైల్వే స్టేషన్‌లో సంరక్షకులు లేకుండా ఒంటరిగా తిరుగుతున్న ఓ చిన్నారి కనిపించింది. ప్రయాణికులు 139 నంబర్‌కు సమాచారం ఇవ్వగా, జీఆర్పీ సిబ్బంది అబ్బాయిని శిశుగృహనికి తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఒంటరిగా దిగిన బాలుడికి మూడేళ్లు ఉంటాయని వివరాలు తెలిసిన వారు శ్రీకాకుళంలోని ఉమన్ ఛైల్డ్ డిపార్ట్ మెంట్‌కు తెలపాలని జీఆర్పీ ఎస్సై శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

News September 20, 2025

పొందూరు: భవనంపై నుంచి జారిపడిన విద్యార్థిని

image

పాఠశాల భవనంపై నుంచి జారిపడి ఓ విద్యార్థిని తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన పొందూరు(M) లోలుగులోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మూడంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడింది. తీవ్రగాయాలవ్వడంతో ఆమెను నైట్ డ్యూటీ సిబ్బంది హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 20, 2025

టీటీడీ ప్రసాదాల తయారీకి సిక్కోలు ఆర్గానిక్ బెల్లం

image

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నిమ్మతొర్లువాడ అనే చిన్న పల్లెటూరులో తయారయ్యే ఆర్గానిక్ బెల్లం చాలా ప్రత్యేకం. తిరుమల ప్రసాదాల తయారీలోనే కాదు, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులకు కూడా దీనినే ఉపయోగిస్తున్నారు. టీటీడీ నాణ్యత ప్రమాణాలు తట్టుకొని ‘అగ్ మార్క్ ‘ సర్టిఫికేషన్ పొందిన ఈ బెల్లానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నామని ఇక్కడి తయారీదారులు చెబుతున్నారు.