News September 20, 2025
సిరిసిల్ల కలెక్టర్ బదిలీకి రంగం సిద్ధం?

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రజాపాలన దినోత్సవ జెండా ఆవిష్కరణలో ప్రొటోకాల్ విస్మరించడం పట్ల చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న విప్ ఆది శ్రీనివాస్ ప్రొటోకాల్తో పాటు కలెక్టర్ తరచూ వివాదాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై రేవంత్ సీరియస్గా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది.
Similar News
News September 20, 2025
హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నీలి నీడలు?

హైదరాబాద్ మెట్రో ఏర్పాటుకు రూ.వేల కోట్లు వెచ్చించారు. లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇపుడు మెట్రో నిర్వహణే సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో నడపడం కష్టమని ఎల్ అండ్ టీ చెబుతోంది. అయితే డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మెట్రో రైలు అసలు తిరుగుతుందా అనే అనుమానాలు నగర వాసికి వస్తున్నాయి.
News September 20, 2025
హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నీలి నీడలు?

హైదరాబాద్ మెట్రో ఏర్పాటుకు రూ.వేల కోట్లు వెచ్చించారు. లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇపుడు మెట్రో నిర్వహణే సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో నడపడం కష్టమని ఎల్ అండ్ టీ చెబుతోంది. అయితే డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మెట్రో రైలు అసలు తిరుగుతుందా అనే అనుమానాలు నగర వాసికి వస్తున్నాయి.
News September 20, 2025
HYD: పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్కు వినతి

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ను పంచాయితీ కార్యదర్శులు శనివారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. 317 జీవోతో పంచాయతీ కార్యదర్శులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. 317 జీవోతో నష్టపోయిన పంచాయితీ కార్యదర్శులకు 190 జీవో ప్రకారం తాత్కాలిక డిప్యూటేషన్లు, కల్పించాలని కోరారు. దేనికి సంబంధించి వినతిపత్రం అందజేశారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.