News September 20, 2025
HYD: అన్ని డిపోల నుంచి వారికి స్పెషల్ బస్సులు..!

యాత్రాదానం గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ ప్రోగ్రాంలో భాగంగా HYD, ఉమ్మడి RR అన్ని డిపోల నుంచి అరుణాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, వరంగల్, కాళేశ్వరం, అనంతగిరి, కొమురవెల్లి, ద్వారకాతిరుమల, అన్నవరం, వేములవాడ వంటి ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రాలకు బస్సులను ఏర్పాటు చేస్తామని రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విరాళాల ద్వారా వృద్ధులు, అనాథల కోసం ప్రత్యేకంగా యాత్ర స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Similar News
News September 20, 2025
HYD: అసలు మెట్రో మ్యాన్ను ఎందుకు తప్పించినట్టు?

మెట్రో పనులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 18 సంవత్సరాలు.. హైదరాబాద్ మెట్రో అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుంది. మెట్రో మ్యాన్ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఆయనే ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ఆయన్ను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పించారు అనేది ఇపుడు సిటీలో చర్చనీయాంశంగా మారింది. అసలే సందిగ్ధంలో ఉన్న మెట్రో నిర్వహణపై ఎండీ మార్పు ప్రభావం పడుతుందనేది నిర్వివాదాంశం.
News September 20, 2025
HYD TO నిజామాబాద్.. రైలు రద్దు..!

మెయింటెన్స్ పనుల కారణంగా నిజామాబాద్ వెళ్లే రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. HYD కాచిగూడ-నిజామాబాద్ రైలు (77601), నిజామాబాద్-కాచిగూడ రైలు (77602) రైళ్లు ప్రస్తుతానికి రద్దయ్యాయి. నవంబర్ 30వ తేదీ వరకు ఈ రైళ్లు ఉండవని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.
News September 20, 2025
హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నీలి నీడలు?

హైదరాబాద్ మెట్రో ఏర్పాటుకు రూ.వేల కోట్లు వెచ్చించారు. లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇపుడు మెట్రో నిర్వహణే సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో నడపడం కష్టమని ఎల్ అండ్ టీ చెబుతోంది. అయితే డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మెట్రో రైలు అసలు తిరుగుతుందా అనే అనుమానాలు నగర వాసికి వస్తున్నాయి.