News September 20, 2025

రేవంత్‌కు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది: రామ్‌చందర్

image

TG: CM రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రాష్ట్ర BJP చీఫ్ రామ్‌చందర్ ఎద్దేవా చేశారు. ‘కిషన్‌రెడ్డిని నిందించడం రేవంత్‌ మానుకోవాలి. ఆయనకు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ CBI దగ్గర ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ ‘మావోలతో చర్చల అంశం కేంద్రం చూసుకుంటుంది. వారితో అనేకసార్లు చర్చలు జరిగినా హింస పెరిగిందే కానీ తగ్గలేదు’ అని చెప్పారు.

Similar News

News September 20, 2025

ఇడ్లీ, దోశపై GST.. ప్రచారాస్త్రం కానుందా..?

image

కేంద్రం తాజా GST మార్పుల్లో ఇడ్లీ, దోశలను 5% శ్లాబులోనే ఉంచడం విమర్శలకు దారితీస్తోంది. ఉత్తరాదిన ఎక్కువ తినే రోటీలను 0% పన్నులోకి తీసుకొచ్చి సౌత్‌లో పాపులర్ టిఫిన్ల ట్యాక్స్ మార్చలేదు. అసలే ఉత్తరాది, హిందీ ఆధిపత్య అంశాలు తరచూ ప్రస్తావనకు వచ్చే తమిళనాట రానున్న వేసవిలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడి పార్టీలకు ఈ పన్ను BJPపై ప్రచారాస్త్రంగా మారవచ్చని విశ్లేషకుల అంచనా. టిఫిన్ ట్యాక్స్‌పై మీ కామెంట్?

News September 20, 2025

పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

image

AP: పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.

News September 20, 2025

Dy.CM పవన్‌కు ధన్యవాదాలు: బోండా ఉమ

image

AP: అసెంబ్లీలో <<17761609>>ప్రస్తావించిన సమస్య<<>>ను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం పెరుగుతున్నాయి’ అని బోండా ట్వీట్ చేశారు.