News September 20, 2025
HYD: దసరా తర్వాత పాఠశాలల్లో తనిఖీలు..!

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అధికారి రెండు జిల్లాలను తనిఖీ చేయనున్నారు. స్కూళ్లలో పరిశుభ్రత, కొత్త ప్రవేశాలు, డేటా సవరణ, ముఖ గుర్తింపు హాజరు అమలు, PM పోషణ స్కీమ్ అమలు వంటి విషయాలను దసరా తర్వాత ఈ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చని యోచిస్తోంది.
Similar News
News September 20, 2025
MGBS టు చాంద్రాయణగుట్ట.. ఇప్పట్లో కష్టమే?

హైదరాబాద్ మెట్రోను పాతబస్తీకి తీసుకెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ నడుపుతామని ప్రభుత్వం భావించింది. అందుకు చురుగ్గా పనులు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు 7.5 కిలోమీటర్ల ఈ పనులపై ఇపుడు నీలినీడలు కమ్ముకున్నాయి. ఇపుడు నడుస్తున్న మెట్రోనే మేము నిర్వహించలేమని ఎల్అండ్ టీ చెబుతోంటే ఓల్డ్ సిటీ మెట్రో ఇప్పుడు కష్టమే అని తెలుస్తోంది.
News September 20, 2025
సూర్యాపేట: అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ఆకాశమే హద్దుగా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. నేటి సాంకేతిక, కృత్రిమ మేధస్సు యుగంలో స్వతంత్రంగా ఆలోచనలతో భవిష్యత్తులో ఏమి అవ్వాలో ఆలోచిస్తూ దాన్ని చేరేందుకు కృషి చేయాలన్నారు.
News September 20, 2025
MGBS టు చాంద్రాయణగుట్ట.. ఇప్పట్లో కష్టమే?

హైదరాబాద్ మెట్రోను పాతబస్తీకి తీసుకెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ నడుపుతామని ప్రభుత్వం భావించింది. అందుకు చురుగ్గా పనులు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు 7.5 కిలోమీటర్ల ఈ పనులపై ఇపుడు నీలినీడలు కమ్ముకున్నాయి. ఇపుడు నడుస్తున్న మెట్రోనే మేము నిర్వహించలేమని ఎల్అండ్ టీ చెబుతోంటే ఓల్డ్ సిటీ మెట్రో ఇప్పుడు కష్టమే అని తెలుస్తోంది.