News September 20, 2025
HYD: దసరా తర్వాత పాఠశాలల్లో తనిఖీలు..!

HYD, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అధికారి రెండు జిల్లాలను తనిఖీ చేయనున్నారు. స్కూళ్లలో పరిశుభ్రత, కొత్త ప్రవేశాలు, డేటా సవరణ, ముఖ గుర్తింపు హాజరు అమలు, PM పోషణ స్కీమ్ అమలు వంటి విషయాలను దసరా తర్వాత ఈ కమిటీలు పరిశీలిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించవచ్చని యోచిస్తోంది.
Similar News
News September 20, 2025
MGBS టు చాంద్రాయణగుట్ట.. ఇప్పట్లో కష్టమే?

హైదరాబాద్ మెట్రోను పాతబస్తీకి తీసుకెళ్లాలన్న కాంగ్రెస్ పార్టీ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైల్ నడుపుతామని ప్రభుత్వం భావించింది. అందుకు చురుగ్గా పనులు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు 7.5 కిలోమీటర్ల ఈ పనులపై ఇపుడు నీలినీడలు కమ్ముకున్నాయి. ఇపుడు నడుస్తున్న మెట్రోనే మేము నిర్వహించలేమని ఎల్అండ్ టీ చెబుతోంటే ఓల్డ్ సిటీ మెట్రో ఇప్పుడు కష్టమే అని తెలుస్తోంది.
News September 20, 2025
HYD: అసలు మెట్రో మ్యాన్ను ఎందుకు తప్పించినట్టు?

మెట్రో పనులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 18 సంవత్సరాలు.. హైదరాబాద్ మెట్రో అంటే ఆయన పేరే గుర్తుకు వస్తుంది. మెట్రో మ్యాన్ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. ఆయనే ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో ఎండీగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ఆయన్ను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పించారు అనేది ఇపుడు సిటీలో చర్చనీయాంశంగా మారింది. అసలే సందిగ్ధంలో ఉన్న మెట్రో నిర్వహణపై ఎండీ మార్పు ప్రభావం పడుతుందనేది నిర్వివాదాంశం.
News September 20, 2025
HYD TO నిజామాబాద్.. రైలు రద్దు..!

మెయింటెన్స్ పనుల కారణంగా నిజామాబాద్ వెళ్లే రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. HYD కాచిగూడ-నిజామాబాద్ రైలు (77601), నిజామాబాద్-కాచిగూడ రైలు (77602) రైళ్లు ప్రస్తుతానికి రద్దయ్యాయి. నవంబర్ 30వ తేదీ వరకు ఈ రైళ్లు ఉండవని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.