News September 20, 2025

సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు: DEO

image

సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DEO KVN.కుమార్ శనివారం తెలిపారు. విద్యాశాఖ డైరెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు, అన్ని యాజమాన్య పాఠశాలలకు దసరా సెలవులను 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు (11 రోజులు) ప్రకటించినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సెలవులను ప్రకటించాలన్నారు.

Similar News

News September 20, 2025

HYD: రేపు తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు

image

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.

News September 20, 2025

HYD: రేపు తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు

image

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.

News September 20, 2025

NZB: అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,01,116 విరాళం

image

ఎస్‌జీఎస్ పద్మావతి నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,01,116 PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరాళం ప్రకటించారు. శనివారం గంగస్థాన్ ఫేజ్-2లోని ఉత్తర తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదన్నారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో తాను మొదటివాడినని, దేవుని ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.