News September 20, 2025
ఈనెల 22న మేడారానికి సీఎం రేవంత్

ఈనెల 22న మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారయ్యింది. సీఎంవో నుంచి సమాచారం అందుకున్న ములుగు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ దివాకర అధికారులతో అత్యవసర సమావేశానికి ఆదేశించారు. 2026లో జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రూ.150కోట్లను మంజూరు చేశారు.
Similar News
News September 20, 2025
HYD: రేపు తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్లోని తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.
News September 20, 2025
HYD: రేపు తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్లోని తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.
News September 20, 2025
NZB: అన్నదానం ట్రస్ట్కు రూ.1,01,116 విరాళం

ఎస్జీఎస్ పద్మావతి నిత్య అన్నదానం ట్రస్ట్కు రూ.1,01,116 PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరాళం ప్రకటించారు. శనివారం గంగస్థాన్ ఫేజ్-2లోని ఉత్తర తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదన్నారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో తాను మొదటివాడినని, దేవుని ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.