News September 20, 2025
KMR: 46% నేరాల ఛేదన.. 42% సొత్తు రికవరీ

కామారెడ్డి జిల్లా పోలీసులు నేరస్తులను పట్టుకోవడంలో విశేష కృషి చేస్తున్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘Chase, Catch, Solve’ కు చెందిన కొత్త పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది జిల్లాలో 46% ఆస్తి సంబంధిత నేరాలను ఛేదించి, 42% చోరీ సొత్తును రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, UPలకు చెందిన 10 అంతరాష్ట్ర గ్యాంగ్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 20, 2025
HYD: రేపు తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్లోని తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.
News September 20, 2025
HYD: రేపు తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని BRS పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) మధ్యాహ్నం HYD బంజరాహిల్స్లోని తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు మహిళా నాయకురాలు సుశీల రెడ్డి ఈరోజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీ ఛైర్మన్లు, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు.
News September 20, 2025
NZB: అన్నదానం ట్రస్ట్కు రూ.1,01,116 విరాళం

ఎస్జీఎస్ పద్మావతి నిత్య అన్నదానం ట్రస్ట్కు రూ.1,01,116 PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విరాళం ప్రకటించారు. శనివారం గంగస్థాన్ ఫేజ్-2లోని ఉత్తర తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదన్నారు. దేవుడిని నమ్మే వ్యక్తుల్లో తాను మొదటివాడినని, దేవుని ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.