News September 20, 2025
HYD: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదు: బీజేపీ స్టేట్ చీఫ్

తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ సమస్యపై HYDలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఈరోజు మాట్లాడారు. 2020లో BRS ప్రభుత్వం తెచ్చిన G.O.68 చిన్న హోర్డింగ్ ఏజెన్సీలను కూలదోసిందని ఆరోపించారు. 3 పెద్ద ఏజెన్సీలకు మాత్రమే లాభం చేకూర్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కుటుంబాల జీవనోపాధి దెబ్బతిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలల తర్వాత కూడా హామీ నిలబెట్టలేదని విమర్శించారు.
Similar News
News September 20, 2025
17 మంది ఇంజినీర్లపై సీఎంకు ఏసీబీ నివేదిక

TG: TGSPDCL ఇంజినీర్ల అక్రమాలపై ACB ఫోకస్ పెట్టింది. ఇటీవల ADE <<17730161>>అంబేడ్కర్<<>> వద్ద రూ.వందల కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా మరో 17 మంది ఇంజినీర్ల అవినీతిపై CM రేవంత్కు ACB నివేదిక ఇచ్చింది. HYDలోని ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, కందుకూరులో ADE, CE స్థాయుల్లో పనిచేసిన వీరు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. బదిలీ విధానంలో ఇంజినీర్లకు ఆప్షన్లిచ్చి అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చిన తీరును ప్రస్తావించింది.
News September 20, 2025
యాదాద్రి: శ్రీ స్వామివారి సేవలో హైకోర్ట్ జడ్జి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని శనివారం హైకోర్టు జడ్జి కే.శరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని ధ్వజస్తంభ దర్శనానంతరం స్వయంభు దర్శనం చేసుకొని గోత్రనామార్చిన పూజలు చేశారు. అర్చకులు స్వర్ణ పుష్పార్చన చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు.
News September 20, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ విద్యార్థులను కొట్టిన ప్రిన్సిపల్.. డీఈఓ విచారణ
➤ నర్సీపట్నం రూరల్ పిఎస్ను తనిఖీ చేసిన విశాఖ రేంజ్ డీఐజీ
➤ జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర
➤ ఇంటి బాట పట్టిన హాస్టల్ విద్యార్థులు
➤ కాశీపురంలో పరిశుభ్రత పాటించని 8 షాపులకు జరిమానా
➤ పోలీస్ సంకల్పంలో భాగంగా విద్యార్థులకు అవగాహన
➤ టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లు
➤ రైవాడ సాగునీటి కాలువలు అభివృద్ధికి రూ.50 లక్షలు