News September 20, 2025
ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగులు

AP: పలువురు IAS అధికారులకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీజెన్కో ఎండీగా ఎస్.నాగలక్ష్మి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బీఆర్ అంబేడ్కర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధిశాఖ అదనపు కమిషనరుగా అమిలినేని భార్గవ్ తేజ.. కృష్ణా జిల్లా జేసీగా మల్లారపు నవీన్ను నియమించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Similar News
News September 20, 2025
కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.
News September 20, 2025
రేపటి నుంచే సెలవులు.. హైవేపై రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 22 నుంచి దసరా సెలవులు మొదలవనుండగా ఆదివారం కలిసి రావడంతో రేపటి నుంచే హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. దీంతో HYD-విజయవాడ హైవే వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. HYD నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి HYDకు రాకపోకలు సాగించేవారితో టోల్ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఇక ఏపీలో వచ్చేనెల 3న, టీజీలో 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అప్పటివరకు విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు.
News September 20, 2025
17 మంది ఇంజినీర్లపై సీఎంకు ఏసీబీ నివేదిక

TG: TGSPDCL ఇంజినీర్ల అక్రమాలపై ACB ఫోకస్ పెట్టింది. ఇటీవల ADE <<17730161>>అంబేడ్కర్<<>> వద్ద రూ.వందల కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా మరో 17 మంది ఇంజినీర్ల అవినీతిపై CM రేవంత్కు ACB నివేదిక ఇచ్చింది. HYDలోని ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, కందుకూరులో ADE, CE స్థాయుల్లో పనిచేసిన వీరు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. బదిలీ విధానంలో ఇంజినీర్లకు ఆప్షన్లిచ్చి అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చిన తీరును ప్రస్తావించింది.