News September 20, 2025

నాయుడుపేటలో లారీ ఢీకొని ట్రాక్టర్ మెకానిక్ మృతి

image

నాయుడుపేటలోని ఎల్.ఏ సాగరానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ లక్ష్మణ్‌ లారీ ఢీకొని శనివారం మృతి చెందాడు. లక్ష్మణ్ నాయుడుపేటలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ట్రాక్టర్ సర్వీస్ కోసం బైకుపై ఓజిలికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మూర్తిరెడ్డిపాలెం వద్ద లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట హాస్పిటల్‌కి తరలించారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News September 21, 2025

భట్టిప్రోలు వద్ద ప్రమాదం.. తండ్రీ కూతురు మృతి

image

ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో శనివారం చోటుచేసుకుంది. SI శివయ్య తెలిపిన వివరాల మేరకు… రేపల్లెకు చెందిన చొక్కాకుల నాగసాయి అతని భార్య, ఇద్దరు పిల్లలు ద్విచక్ర వాహనంపై రేపల్లె నుంచి బాపట్ల వెళ్తుండగా కన్నెగంటివారిపాలెం హైవేపై తమ ముందు వెళ్తున్న ఒంటి ఎద్దు బండిని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నాగసాయి అతని కూతురు పల్లవి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.

News September 21, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో వైభవంగా రుద్రహోమం
✓ భద్రాద్రి: తల్లీ, కుమారుడు అదృశ్యం
✓ మణుగూరు: ఈవోతో భక్తుల వాగ్వాదం..!
✓ అశ్వారావుపేట సొసైటీ సీఈవో సస్పెన్షన్
✓ అశ్వారావుపేట పోలీసులపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు
✓ సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వాలని సీఎంకు కొత్తగూడెం ఎమ్మెల్యే వినతి
✓ మణుగూరు: డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన
✓ కొత్తగూడెం: గంజాయి విక్రయదారుల అరెస్ట్

News September 21, 2025

కృష్ణా: ఆ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు..!

image

జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 3 వ్యక్తులు ఎమ్మెల్యేలుగా పాలన నడుస్తోంది. JSP MLA, ఆయన కుమారుడు, అల్లుడు వేర్వేరుగా వ్యవహారాలు చూసుకుంటున్నారు. అల్లుడు వ్యాపారం, కొడకు కేడర్, MLA అధికారులను డీల్ చేస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవులు మాత్రం టీడీపీ నేతలకే దక్కుతున్నాయని జనసేన శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు వాపోతున్నట్లు సమాచారం.