News April 5, 2024

కరీంనగర్ సందర్శనకు KCR ఎలా వస్తారు?: బండి సంజయ్

image

పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నేడు కరీంనగర్‌కు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఏ ముఖం పెట్టుకుని పంట పొలాల సందర్శనకు వస్తున్నారో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. కేసీఆర్‌కు నిజంగా రైతులపట్ల చిత్తుశుద్ధి ఉంటే రైతుల దుస్థితికి తానే కారణమని ఒప్పుకుని ముక్కు నేలకు రాసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి కరీంనగర్‌కు రావాలని గురువారం ఓ సమావేశంలో డిమాండ్ చేశారు.

Similar News

News December 28, 2025

కరీంనగర్: ఓపెన్‌ స్కూల్‌ పరీక్షా ఫీజు గడువు ఖరారు

image

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫీజు జనవరి 5 వరకు చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్‌ రామడుగు రవీందర్‌ తెలిపారు. 25 రూపాయల ఫైన్‌తో జనవరి 6 నుంచి 12 వరకు, 50 రూపాయల ఫైన్‌తో జనవరి 13 నుంచి 16 వరకు, అలాగే తత్కాల్‌ పద్దతి కింద జనవరి 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. వివరాలకు 9440415099 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

News December 28, 2025

జమ్మికుంట: అంబేద్కర్ వర్సిటీ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

image

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించే గడువును జనవరి 2వ తేదీ వరకు పొడిగించినట్లు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో బి.ఏ, బి.కామ్‌, బి.ఎస్సీ చదువుతున్న మొదటి, మూడు, ఐదో సెమిస్టర్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 28, 2025

KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.