News September 20, 2025

BREAKING: HYD: నగరం నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ..!

image

హైదరాబాద్‌లో రౌడీ షీటర్ మహమ్మద్ అసద్‌పై 11కు మించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హింసాత్మక స్వభావం, బెదిరింపులు, ప్రత్యర్థులపై హత్యాయత్నాలు చేసిన నేరస్థుడు అతడు. 2024లో అసద్ అనుచరులతో కలిసి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిని హత్య చేశాడు. ఇటీవల మరో గ్యాంగ్‌పై దాడికి సిద్ధమవుతుండగా తుపాకీ, బుల్లెట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఏడాదిపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు CP CV ఆనంద్ తెలిపారు.

Similar News

News September 21, 2025

HYD: సైబరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ధ్వంసం

image

మాదకద్రవ్యాల మాఫియాకు సైబరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. రూ.25.30 కోట్ల విలువైన 1,858 కిలోల మాదకద్రవ్యాలను ఈరోజు ధ్వంసం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కమిషనరేట్ చేపట్టిన 7వ దశ చర్య ఇది అని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి పర్యవేక్షణలో డీసీపీ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో 316 కేసులకు సంబంధించిన ఈ డ్రగ్స్‌ను పర్యావరణ నిబంధనల ప్రకారం దహనం చేశారు.

News September 20, 2025

HYD: రాత్రుళ్లు వస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాల కేసుల్లో ముగ్గురు నిందితులను HYD హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22.6 తులాల బంగారం, 6 తులాల వెండి, రూ.3 లక్షల నగదు, కారును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థుడు మాండ్ల శివ జైలులో పరిచయమైన వారితో కలిసి గ్రేటర్ HYD పరిధిలో మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు. బంజారా కాలనీ, RTC మజ్దూర్ నగర్, జయసూర్య నగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి చొరబడి చోరీ చేస్తున్నారు.

News September 20, 2025

HYD: కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

image

వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో ఈరోజు HYDలోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. 2009లో ఈ సేవలు ప్రారంభించినప్పుడు 1,230 మంది డయాలసిస్ పేషెంట్లున్నారన్నారు.