News September 20, 2025

ఏలూరు: కోర్టు మానిటరింగ్ సభ్యులతో ఎస్పీ సమీక్ష

image

ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల విచారణ వేగవంతం చేసేందుకు సాక్షులను సకాలంలో హాజరుపరచాలని ఎస్పీ సూచించారు. నేరస్తులు తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం జరగాలని ఆదేశించారు. కోర్టు ప్రక్రియను ప్రతిరోజు నమోదు చేయాలని సూచించారు.

Similar News

News September 21, 2025

HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్‌కు సత్కారం

image

HYD కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్‌కుమార్‌తోపాటు కూకట్‌పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.

News September 21, 2025

HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్‌కు సత్కారం

image

HYD కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్‌కుమార్‌తోపాటు కూకట్‌పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.

News September 21, 2025

H1B వీసా సమస్యను వెంటనే పరిష్కరించాలి: CM రేవంత్

image

TG: H1B వీసాపై ట్రంప్ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఇండో-అమెరికన్ సత్సంబంధాల్లో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదన్నారు. దీని వల్ల తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు.