News September 20, 2025

HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

image

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.

Similar News

News September 21, 2025

FLASH: HYD కమిషనరేట్‌లో భారీగా పోలీసుల బదిలీలు

image

HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పోలీసుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. ఉమెన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్‌కు సైతం సీపీ సీవీ ఆనంద్ పోస్టింగ్స్ ఇచ్చారు. 38 మంది ఎస్ఐలు, పీఎస్ఐల సాధారణ బదిలీలు, పోస్టింగ్స్ ఇచ్చారు. 47 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 78 మంది కానిస్టేబుల్స్ బదిలీలు జరిగాయి.

News September 21, 2025

HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్‌కు సత్కారం

image

HYD కూకట్‌పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్‌కుమార్‌తోపాటు కూకట్‌పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.

News September 21, 2025

HYD: సైబరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ధ్వంసం

image

మాదకద్రవ్యాల మాఫియాకు సైబరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. రూ.25.30 కోట్ల విలువైన 1,858 కిలోల మాదకద్రవ్యాలను ఈరోజు ధ్వంసం చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కమిషనరేట్ చేపట్టిన 7వ దశ చర్య ఇది అని పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి పర్యవేక్షణలో డీసీపీ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో 316 కేసులకు సంబంధించిన ఈ డ్రగ్స్‌ను పర్యావరణ నిబంధనల ప్రకారం దహనం చేశారు.