News April 5, 2024

రేపటి నుంచి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు నెల్లిమర్ల, ఏప్రిల్ 7న అనకాపల్లి, ఏప్రిల్ 8న ఎలమంచిలి నియోజకవర్గాల్లో జరిగే వారాహి విజయ భేరి యాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తీవ్ర జ్వరం నుంచి కోలుకోవడంతో ఆయన ప్రచార షెడ్యూల్‌ను పార్టీ విడుదల చేసింది.

Similar News

News October 8, 2024

జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ట్టు కోల్పోతున్న PDP

image

JKలో PDP పట్టుకోల్పోతోంది. 2014 ఎన్నిక‌ల్లో ముఫ్తీ మొహ‌మ్మ‌ద్ సార‌థ్యంలో 28 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో 4 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. 2014లో ముక్కోణ‌పు పోటీలో హంగ్ ఏర్ప‌డింది. దీంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు BJPతో PDP చేతులుకలపడం ప్రజలకు రుచించినట్టు లేదు. JK ఓట‌ర్లు ఆ పార్టీని తిర‌స్క‌రించారు. పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమె కుమార్తె ఇల్తిజా ఓటమిపాలయ్యారు.

News October 8, 2024

మాపై దాడి చేస్తే ప్రతీకార దాడులు తప్పవు: ఇరాన్

image

తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News October 8, 2024

టమాటా తెచ్చిన తంటా.. 250 కి.మీ వెంబడించి!

image

ప్రస్తుతం టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిదే రైతులు, వ్యాపారస్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని ములుబాగల్‌కు చెందిన ఓ ట్రక్ డ్రైవర్ హైదరాబాద్‌లో టమాటాలు విక్రయించి తిరుగుపయనమయ్యాడు. కర్నూలు సమీపంలో టీ తాగేందుకు ట్రక్ ఆపగా ఓ దొంగల ముఠా టమాటా విక్రయించి వస్తున్న విషయం తెలుసుకుంది. 250 కి.మీ వెంబడించి సోమందేపల్లి వద్ద ట్రక్‌ను ఆపి రూ.5 లక్షలతోపాటు సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లిపోయారు.