News September 20, 2025

D.ed విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు

image

D.ed విద్యార్థులకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉంటాయని గోపాల్‌పేట్ మండలంలోని డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. అక్టోబర్ 4న కళాశాల పునః ప్రారంభం కానున్నదని అన్నారు. దసరా సెలవులను విద్యార్థులు ఆటపాటలతో గడపడంతో పాటు కొంత సమయాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగించుకోవాలన్నారు. ఈనెల 22 నుంచి 27 డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు.

Similar News

News September 21, 2025

వనదేవతల గద్దెలు యథాతథం. ప్రాంగణం మాత్రమే విస్తరణ..!

image

మేడారం వన దేవతల గద్దెల మార్పుపై ఉత్కంఠ వీడింది. వరుస క్రమంలో గద్దెలను మార్చి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేయాలనే పూజారుల సూచన మేరకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆదివాసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చర్చ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాలను పాటిస్తూ గద్దెలను యథాతథంగా ఉంచాలని, ప్రాంగణం విస్తరణకు ప్రణాళిక చేయాలని సూచించారు.

News September 21, 2025

మేడారంలో హరితం.. వెలుగులీననున్న సంప్రదాయం!

image

కోటిన్నర మంది భక్తుల రాకతో రెండేళ్లకోసారి జనారణ్యంగా మారే మేడారంలో ఆదివాసీలు దైవంలా కొలిచే సంప్రదాయ వృక్షాలు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు వనదేవతల గద్దెలపై ఉండే రావి, జువ్వి, బండారి వంటి జాతుల వృక్షాలు కనుమరుగయ్యాయి. ఈ పరిణామం భక్తుల విశ్వాసాలకు ఇబ్బందిగా మారింది. అయితే.. మేడారం పరిసరాల్లో ఆదివాసీల సంప్రదాయ వృక్షాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. అలాగే ఇప్ప, వెదురు వనాలను సంరక్షించాలి.

News September 21, 2025

వేయి స్తంభాల గుడిలో వేడుకలు.. హాజరుకానున్న మంత్రులు

image

రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌నున్న బ‌తుక‌మ్మ వేడుక‌లు రేపు వేయిస్తంభాల గుడిలో ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. రాష్ట్ర మ‌హిళ‌ల‌కు మంత్రి కొండా సురేఖ బ‌తుక‌మ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్రభుత్వం ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింద‌ని మంత్రి సురేఖ తెలిపారు.