News September 20, 2025

వరంగల్ ఎంజీఎంలో మళ్లీ దారుణం..!

image

వరంగల్ ఎంజీఎంలో మరోసారి వైద్యుల నిర్లక్ష్య ధోరణి బట్టబయలైంది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి బ్లడ్ తక్కువ ఉండటంతో ఈనెల 16న ఎంజీఎంలో చేరింది. పరీక్షలు చేసి రక్తం తక్కువగా ఉందని తేల్చిన వైద్యులు తన గ్రూపు O+ రక్తం ఎక్కించాలని సూచించారు. ఈనెల 17, 18న రెండు రోజుల్లో O+ రక్తానికి బదులుగా B+ బ్లడ్ ఎక్కించారు. 19న బ్లడ్ కావాలని శాంపిల్స్ చూడటంతో O+ గ్రూప్ ఉండటంతో అవాక్కయ్యారు.

Similar News

News September 21, 2025

ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్

image

TG: ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క-సారలమ్మ పూజారులను సంప్రదించనున్నారు. వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను సీఎం రిలీజ్ చేస్తారు. ఈ మేరకు మేడారం అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. <<17659055>>గద్దెలను<<>> యధాతథంగా ఉంచి సంప్రదాయాలను పాటిస్తూ, ఆలయ ప్రాంగణాన్ని మరింత విస్తరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

News September 21, 2025

వనదేవతల గద్దెలు యథాతథం. ప్రాంగణం మాత్రమే విస్తరణ..!

image

మేడారం వన దేవతల గద్దెల మార్పుపై ఉత్కంఠ వీడింది. వరుస క్రమంలో గద్దెలను మార్చి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేయాలనే పూజారుల సూచన మేరకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆదివాసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చర్చ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాలను పాటిస్తూ గద్దెలను యథాతథంగా ఉంచాలని, ప్రాంగణం విస్తరణకు ప్రణాళిక చేయాలని సూచించారు.

News September 21, 2025

మేడారంలో హరితం.. వెలుగులీననున్న సంప్రదాయం!

image

కోటిన్నర మంది భక్తుల రాకతో రెండేళ్లకోసారి జనారణ్యంగా మారే మేడారంలో ఆదివాసీలు దైవంలా కొలిచే సంప్రదాయ వృక్షాలు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు వనదేవతల గద్దెలపై ఉండే రావి, జువ్వి, బండారి వంటి జాతుల వృక్షాలు కనుమరుగయ్యాయి. ఈ పరిణామం భక్తుల విశ్వాసాలకు ఇబ్బందిగా మారింది. అయితే.. మేడారం పరిసరాల్లో ఆదివాసీల సంప్రదాయ వృక్షాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. అలాగే ఇప్ప, వెదురు వనాలను సంరక్షించాలి.