News September 20, 2025

గుంటూరు: పీజీ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన పీజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను అధికారులు శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఎమ్మెస్సీ బోటనీ, కంప్యూషనల్ డేటా సైన్స్, ఎంఏ హిస్టరీ, ఆర్కియాలజీ, మహాయాన బుద్ధిస్ట్, ఎంబీఏ మీడియా మేనేజ్‌మెంట్ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ https://kru.ac.in/ సందర్శించాలని అధికారులు సూచించారు.

Similar News

News September 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 21, 2025

ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్

image

TG: ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనున్నారు. ఆలయ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క-సారలమ్మ పూజారులను సంప్రదించనున్నారు. వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను సీఎం రిలీజ్ చేస్తారు. ఈ మేరకు మేడారం అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. <<17659055>>గద్దెలను<<>> యధాతథంగా ఉంచి సంప్రదాయాలను పాటిస్తూ, ఆలయ ప్రాంగణాన్ని మరింత విస్తరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

News September 21, 2025

వనదేవతల గద్దెలు యథాతథం. ప్రాంగణం మాత్రమే విస్తరణ..!

image

మేడారం వన దేవతల గద్దెల మార్పుపై ఉత్కంఠ వీడింది. వరుస క్రమంలో గద్దెలను మార్చి భక్తులకు దర్శనాన్ని సులభతరం చేయాలనే పూజారుల సూచన మేరకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆదివాసీ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చర్చ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాలను పాటిస్తూ గద్దెలను యథాతథంగా ఉంచాలని, ప్రాంగణం విస్తరణకు ప్రణాళిక చేయాలని సూచించారు.