News September 20, 2025

బాపట్ల జిల్లాకు భారీ వర్ష సూచన

image

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదని సూచించారు.

Similar News

News September 21, 2025

ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

image

AP: వైసీపీ చీఫ్ YS జగన్ అధ్యక్షతన ఈ నెల 24న ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

News September 21, 2025

యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. భువనగిరి మండలం తుక్కాపురంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఇండ్ల సంఖ్యను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుడు రాచకొండ పాండు ఇంటిని సందర్శించారు.

News September 21, 2025

మహిళల వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర

image

నిన్నటి ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య జరిగిన <<17776758>>వన్డే<<>> మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమెన్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్లు కలిపి అత్యధిక పరుగులు(781) చేసిన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 412 పరుగులు చేయగా, టీమ్ ఇండియా 369 రన్స్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లాండ్-దక్షిణాప్రికా(2017లో 678 రన్స్) పేరిట ఉండేది.