News September 20, 2025

NRPT: పథకాలను సద్వినియోగం చేసుకోండి

image

ప్రభుత్వం మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి M.A.రషీద్ శనివారం కోరారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకంలో భాగంగా వితంతువు, విడాకులు, అనాథలకు వ్యాపారం చేసుకునేందుకు రూ.50 వేలు, ఫకీర్, దూదేకులకు లక్ష ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

Similar News

News September 21, 2025

వరంగల్: ప్రకృతి పండుగకు పువ్వులు కరవు..!

image

వరంగల్ జిల్లాలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళల్లో ఎనలేని ఆనందం నెలకొంటుంది. అలాంటి ప్రకృతి పండుగకు పూలే కరవయ్యాయి. నగరాలకు పూల కొరత ఉన్నప్పటికీ కాస్త గ్రామీణ ప్రాంతాల్లో మెరుగ్గానే పూలు దొరికేవి. కానీ, ప్రతి సెంటు భూమి కూడా సాగులోకి రావడంతో తంగేడు, గునుగు కనిపించట్లేదు. బతుకమ్మ పేర్చాలంటే ఈ రెండు రకాల పూలు లేకపోతే మహిళలకు తీసికట్టుగా ఉంటుంది. దీంతో గ్రామాల నుంచి నగరాలకు పూలు తరలి వెళ్తున్నాయి.

News September 21, 2025

KMR: రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 9 నమూనాల ఎంపిక

image

కామారెడ్డి జిల్లా నుంచి 9 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ బోధనాభ్యాసన సామగ్రి మేళాకు ఎంపికైనట్లు DEO రాజు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్‌ల నుంచి రెండేసి, ఉర్దూ నుంచి ఒక ప్రదర్శన ఎంపికయ్యాయన్నారు. జిల్లాకు ఈ ఘనత సాధించిపెట్టిన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ ప్రదర్శనలు జిల్లా విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

News September 21, 2025

ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం

image

AP: వైసీపీ చీఫ్ YS జగన్ అధ్యక్షతన ఈ నెల 24న ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.