News September 20, 2025
సికింద్రాబాద్ మహంకాళమ్మ గుడిలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ఈరోజు వెల్లడించారు. ఆలయ ఛైర్మన్ రామేశ్వర్తో కలిసి ఉత్సవాల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు.మద్రాస్ కళాకారుల ద్వారా ప్రత్యేక పూలతో అమ్మవారి అలంకరణ ఉంటుందన్నారు.
Similar News
News September 21, 2025
HYD: ORR నుంచి 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు

HYD ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పలు ప్రాంతాలకు రీజినల్ రింగ్ రోడ్డు పనులు సర్కారు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ORR ఎగ్జిట్ నంబర్ 17 నుంచి దాదాపు 55 కిలోమీటర్లు పరిగి ORR వరకు ఈ రోడ్డు నిర్మించనుంది. ఇందుకు సంబంధించి మార్కింగ్ పనులను కూడా అధికారులు ప్రారంభించారు. దాదాపు 24 గ్రామాలను ఈ రహదారి కలుపుతుంది. రేడియల్ పనులు మొత్తం హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తుంది.
News September 21, 2025
FLASH: HYD కమిషనరేట్లో భారీగా పోలీసుల బదిలీలు

HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పోలీసుల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. ఉమెన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్కు సైతం సీపీ సీవీ ఆనంద్ పోస్టింగ్స్ ఇచ్చారు. 38 మంది ఎస్ఐలు, పీఎస్ఐల సాధారణ బదిలీలు, పోస్టింగ్స్ ఇచ్చారు. 47 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 78 మంది కానిస్టేబుల్స్ బదిలీలు జరిగాయి.
News September 21, 2025
HYD: హత్య కేసు ఛేదన.. క్యాబ్ డ్రైవర్కు సత్కారం

HYD కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక సమాచారం అందించిన క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఈరోజు అభినందించారు. కేసు దర్యాప్తులో ధైర్యం చూపించినందుకు ఆయనకు క్యాష్ రివార్డ్ అందజేశారు. బాలానగర్ DCP సురేశ్కుమార్తోపాటు కూకట్పల్లి పోలీస్ సిబ్బందిని కూడా కమిషనర్ ప్రశంసించి నగదు బహుమతి ఇచ్చారు. ప్రజల సహకారంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు.